Thursday, 16 April 2026 06:53:25 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అన్నపూర్ణ ధేవి అలంకరణ లోనున్న కనక దుర్గమ్మ ను దర్శించుకొన్న ఉప రాష్ట్రపతి

అమ్మవారిని దర్శనం ఓ దివ్యమైన అనుభూతి - ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్

Date : 24 September 2025 07:09 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / NTRDistrict : విజయవాడ - సెప్టెంబర్ 24 : దసరా శరన్నవరాత్రులలో మూడవ రోజు అయిన బుధవారం అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతికి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో శీనా నాయక్ స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి క్యూలైన్లలోని భక్తులకు అభివాదం చేస్తూ మహా మండపానికి చేరుకున్నారు. అక్కడ ఉపరాష్ట్రపతి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధికి చేరుకొని అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శీనా నాయక్ ఉపరాష్ట్రపతికి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం ఓ దివ్యానుభూతి అని చెప్పారు.  ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విజయవాడ ఒకటని చెప్పారు. రాష్ట్రం అద్భుతమైన వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :