నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి మార్చి 24 : తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లె పంచాయతీలో ఆదివారం టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. పంచాయతీలోని కోసువారిపల్లి కస్పా, రెడ్డివారిపల్లి, నల్ల తిమ్మి రెడ్డి గారి పల్లి, పెద్ద తిమ్మి రెడ్డి గారి పల్లి, చిన్న రెడ్డివారిపల్లి లలో ఇంటింటా ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో లోని సూపర్ సిక్స్ పథకాలతో కూడిన కరపత్రాలను ఇంటింటా పంపి ణితో పాటు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్లలో వైకాపా పాలన లో అభివృద్ధి జరగకపోగా దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ కేసులు, భూ దోపిడి, మైనింగ్, ఇసుక మాఫియా, పేదల భూముల ఆక్రమణ తప్ప ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై నిస్వార్థ సేవ చేస్తున్న దాసరిపల్లి జై చంద్ర రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే తంబళ్లపల్లె అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో టిడిపి నాయకులకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రచారంలో మహిళా నాయకురాలు సిద్ధమ్మ, బిఎంఆర్ ( రెడ్డప్ప) కృష్ణమూర్తి, శివరాం, సోమశేఖర్, రవి, కృష్ణారెడ్డి, ఆనంద్, వెంకటరమణ, మదన, కృష్ణారెడ్డి, జనసేన నాయకులు ముత్త భరత్, వెంకటరమణారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, రెడ్డప్ప రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Namitha News