Thursday, 16 April 2026 04:51:51 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ప్రశాంతం గా తంబల్లపల్లె మండల సర్వసభ్య సమావేశం

మండల్ మీట్ లో ప్రసంగిస్తున్న ఎంపీపీ అనసూయ

Date : 16 February 2025 11:36 AM Views : 259

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఫిబ్రవరి 15 : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సర్వసభ్య సమావేశాలు జరగకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఆరు మండలాలలో వైకాపా దౌర్జన్యంగా గత స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలను దౌర్జన్యంగా బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారని అధికార టిడిపి నాయకులు మండల మీట్ లను అడ్డుకుంటూ వస్తున్నారు. తంబళ్లపల్లె మండలంలో అభివృద్ధి కుంటుపడి వచ్చిన నిధులు వృధా కాకూడదని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి ఇరువర్గాలతో చర్చించి మండల మీట్ సవ్యంగా జరగడానికి తన చాణక్యం ప్రదర్శించడంలో సఫలమయ్యాడు. శనివారం వైకాపాకు చెందిన 11 మంది ఎంపీటీసీలు, టిడిపి, జనసేనకు చెందిన ఏడు మంది కమిటీ సభ్యులతో ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి అంతా తానై మండల సర్వసభ్య సమావేశం సాఫీగా జరిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనసూయ, ఉపాధ్యక్షులు శ్యామలమ్మ, కరీం టిడిపి కమిటీ సభ్యులు రెడ్డప్ప రెడ్డి, బేరి శ్రీనివాసులు, తులసీధర్ నాయుడు, ఉత్తమ రెడ్డి, కృష్ణమూర్తి నాయుడు, బి ఎమ్ ఆర్, జనసేన పార్టీ నుండి ఎద్దుల నరసింహులు మండలంలోని గ్రామాలలో తాగునీటి సమస్యలు, కొటాల, ప్రాజెక్టు, చౌడ సముద్రం ఏరు పై బ్రిడ్జిలు, కోసువారిపల్లి రహదారి, ఆర్ ఎన్ తాండ పంచాయతీలో రహదారి, పలు ప్రాంతాలలో కచ్చా రోడ్లు నిర్మాణాలు తోబాటు విద్యుత్ సమస్యలపై అధికారుల దృష్టికి తేగా ఎంపీడీవో సానుకూలంగా స్పందించి ప్రతి సమస్యను పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తామని చెప్పారు. మండల మీట్ సవ్యంగా జరగడానికి సహకరించిన వైకాపా ప్రజా ప్రతినిధులు, అధికార కమిటీ సభ్యులు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ మండల సర్వసభ్య సమావేశంలో కో ఆప్షన్ మెంబర్ జమాల్ బాషా, ఏవో థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, ఏఈలు సుజాత, నవీన్ కుమార్, లక్ష్మీనారాయణ, తమ శాఖల అభివృద్ధి పనులు చేపట్టాల్సిన పనులపై నివేదికలు సభకు వివరించారు. మండల్ మీట్లో మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మండల మీట్ కు పలు కీలక శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. ఎస్సై లోకేష్ రెడ్డి ముందస్తుగా ప్రోటోకాల్ పాటించి మండలమీట్ సవ్యంగా సాగడానికి భారీ బందోబస్తు నిర్వహించారు.

తంబళ్లపల్లె ఫిబ్రవరి 15 : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సర్వసభ్య సమావేశాలు జరగకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఆరు మండలాలలో వైకాపా దౌర్జన్యంగా గత స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలను దౌర్జన్యంగా బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారని అధికార టిడిపి నాయకులు మండల మీట్ లను అడ్డుకుంటూ వస్తున్నారు. తంబళ్లపల్లె మండలంలో అభివృద్ధి కుంటుపడి వచ్చిన నిధులు వృధా కాకూడదని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి ఇరువర్గాలతో చర్చించి మండల మీట్ సవ్యంగా జరగడానికి తన చాణక్యం ప్రదర్శించడంలో సఫలమయ్యాడు. శనివారం వైకాపాకు చెందిన 11 మంది ఎంపీటీసీలు, టిడిపి, జనసేనకు చెందిన ఏడు మంది కమిటీ సభ్యులతో ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి అంతా తానై మండల సర్వసభ్య సమావేశం సాఫీగా జరిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనసూయ, ఉపాధ్యక్షులు శ్యామలమ్మ, కరీం టిడిపి కమిటీ సభ్యులు రెడ్డప్ప రెడ్డి, బేరి శ్రీనివాసులు, తులసీధర్ నాయుడు, ఉత్తమ రెడ్డి, కృష్ణమూర్తి నాయుడు, బి ఎమ్ ఆర్, జనసేన పార్టీ నుండి ఎద్దుల నరసింహులు మండలంలోని గ్రామాలలో తాగునీటి సమస్యలు, కొటాల, ప్రాజెక్టు, చౌడ సముద్రం ఏరు పై బ్రిడ్జిలు, కోసువారిపల్లి రహదారి, ఆర్ ఎన్ తాండ పంచాయతీలో రహదారి, పలు ప్రాంతాలలో కచ్చా రోడ్లు నిర్మాణాలు తోబాటు విద్యుత్ సమస్యలపై అధికారుల దృష్టికి తేగా ఎంపీడీవో సానుకూలంగా స్పందించి ప్రతి సమస్యను పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తామని చెప్పారు. మండల మీట్ సవ్యంగా జరగడానికి సహకరించిన వైకాపా ప్రజా ప్రతినిధులు, అధికార కమిటీ సభ్యులు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ మండల సర్వసభ్య సమావేశంలో కో ఆప్షన్ మెంబర్ జమాల్ బాషా, ఏవో థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, ఏఈలు సుజాత, నవీన్ కుమార్, లక్ష్మీనారాయణ, తమ శాఖల అభివృద్ధి పనులు చేపట్టాల్సిన పనులపై నివేదికలు సభకు వివరించారు. మండల్ మీట్లో మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మండల మీట్ కు పలు కీలక శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. ఎస్సై లోకేష్ రెడ్డి ముందస్తుగా ప్రోటోకాల్ పాటించి మండలమీట్ సవ్యంగా సాగడానికి భారీ బందోబస్తు నిర్వహించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :