నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి వాల్మీకి మహాసేన డిమాండ్ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి మహాసేన డిమాండ్ చేసింది. శుక్రవారం స్థానిక ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాశి హరికృష్ణ, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి, నల్లబోతుల సుదర్శన బాబు లు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు ఈ నెల 17వ తేదిన ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వాల్మీకి విగ్రహాలకు పాలాభిషేకం, పులాభిషేకం చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సర్వ జన బోధన ఆసుపత్రి నందు రోగులకు బ్రేడ్ పండ్లు పంపిణి చెస్తామని తెలిపారు. అలాగే చిత్తూరు బస్టాండ్ వాల్మీకి సర్కిల్ నందు అన్నదాన కార్యక్రమం జరుగు తుందని తెలిపారు. ప్రాంతీయ వ్యత్యాసం తొలగించే వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో పునరుద్ధ రించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లోనూ ప్రతి యేటా వెయ్యి కోట్లు నిధులు కేటాయించాలని, జనాభా ప్రాతి పదికన ఎమ్మెల్యే సీట్లు, నామినేటెడ్ పదవులతో పాటు వాల్మీకుల న్యాయమైన కోర్కెలు తీర్చాలన్నారు. వాల్మీకుల వృద్ధాప్య ఆశ్రమానికి స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమం లో వాల్మీకి మహాసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాశి హరికృష్ణ జిల్లా అధ్యక్షులు బోగిటి కృష్ణమూర్తి, రాష్ట్ర నాయకులు వై.విజయకుమార్, జిల్లా నాయకులు ముత్త రాసి రవి, మునస్వామి, మదనపల్లి నియోజకవర్గ నాయకులు శ్రీనివాసులు, బొగ్గెటి చంద్ర, బంగారు శంకర లు పాల్గొన్నారు.
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి వాల్మీకి మహాసేన డిమాండ్
Reporter
Namitha News