నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 26 : తంబళ్లపల్లె మండలం లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా తంబళ్లపల్లె మండలంలో మంజూరైన సిసి రోడ్లు పనులు వేగవంతం చేయాలని క్వాలిటీ కంట్రోల్ ఈఈ విజయ్ భాస్కర్ అధికారులకు సూచించారు. శనివారం ఆయన క్వాలిటీ కంట్రోల్ అధికారి ఉమామహేశ్వర్ తో కలిసి తంబళ్లపల్లె పంచాయతీ సిద్ధారెడ్డి గారి పల్లె సీసీ రోడ్డు నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా జరిగే సిమెంట్ రోడ్డు పనులు నాణ్యత లోపం లేకుండా చూడాలని పంచాయతీరాజ్ ఏ ఈ హరినాథ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శేషాద్రిని ఆదేశించారు. మండలంలో మంజూరైన సిసి రోడ్ల పనులపై ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు శేఖరమ్మ, నాగార్జున, ఫీల్డ్ అసిస్టెంట్లు రమేష్, రెడ్డి రాణి లను అడిగి తెలుసుకున్నారు.
Reporter
Namitha News