నమిత న్యూస్ - Andhra Pradesh / Prakasam : వినుకొండ - అక్టోబర్ 11 : వినుకొండ ఆర్టిసి డిపో కి కేటాయించిన *6 నూతన బస్సులను* రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గారు శుక్రవారం *ప్రారంభించారు.* *15 కోట్ల తో మోడ్రన్ బస్ స్టాండ్ ఏర్పాటుకు* ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, ఆర్టీసీ ఈడి వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా ఆర్ఎం శ్రీనివాసరావు, డిఎం, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News