Thursday, 15 January 2026 12:01:35 PM
# శ్రీజ డైరీ ఆధ్వర్యంలో రంగవల్లుల తో పులకించిన రెడ్డికోట # బుడి బుడి అడుగుల చిన్నారుల గొబ్బిళ్ళు ఆట # 11 మంది జూదరులు అరెస్ట్,రూ 5900/- స్వాధీనం # నిస్వార్ధమైన ప్రజాసేవకుడు కమ్మల రఘు # సత్ సంఘ్ ఫౌండేషన్స్ తో మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ యం.ఓ.యు. # ధాత్రి ఆనంద నిలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. # వైయస్సార్ టీచర్స్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించిన నిస్సార్ అహమ్మద్ # వైద్య కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేయాలి - సీపీఐ # స్టోర్ కింగ్ కంపెనీ కి ఎంపికైన విశ్వం విద్యార్థులు # సదుం యస్.ఐ. గా బాధ్యతలు చేపట్టిన విష్ణు నారాయణ # వైద్య కళాశాల లను ప్రవేట్ పరం చేసే జి.ఓ. ప్రతులను భోగి మంటల్లో వేసిన సిపిఐ నాయకులు # రోడ్డు భద్రత పై ద్విచక్ర వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్న ఆర్.టి.ఏ. అధికారులు # ఆత్మకూరు పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు సంక్రాతి శుభాకాంక్షలు - విద్యుత్ ఏ.డి.ఏ. చిన్నస్వామి నాయక్ # డి.ఆర్.డి.ఓ. వేసవికాలం ఇంటర్న్ షిప్ కు ఎంపికైన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లి బాధితులకు సి.యం.ఆర్.ఎఫ్. చెక్కులు పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే # మదనపల్లి పట్టణం లో 2.5 కోట్ల రూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజలు # తెట్టు లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు, రెండు కేజీ ల గంజాయి స్వాధీనం # మంత్రి మండిపల్లి ని కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు # జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

జనవరి 7వ తేదీన అనంతపురం లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కాంస్య విగ్రహఆవిష్కరణ ను విజవంతం చేయండి

Date : 04 January 2024 10:09 PM Views : 12609

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమిత న్యూస్ - మదనపల్లి : జనవరి 7వ తేదీన అనంతపురం లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తరలిరండి... ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు వరదారెడ్డిగారి నారదరెడ్డి అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఈనెల 7న నిర్వహించే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు వరదారెడ్డిగారి నారదరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవధ్యక్షులు వరదారెడ్డిగారి నారదరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు రెడ్డి కులస్తుల ముద్దుబిడ్డ, ఆంగ్లేయులను తరిమికొట్టి, గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి కె.నాగిరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ, పోరాటాలతో రెడ్డి కులస్తుల్లో స్ఫూర్తిని నింపిన ఏకైక నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయన త్యాగం ఎప్పటికీ మరువలేనిదన్నారు. ప్రజలంతా నరసింహారెడ్డి అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలంటూ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా విగ్రహావిష్కరణతో పాటు రెడ్డి ఆత్మీయ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మస్తాన్ రెడ్డి, నాయకులు వెంకటశివారెడ్డి, రాఘవరెడ్డి, లక్ష్మీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :