నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె సెప్టెంబర్ 11 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో బుధవారం స్థానిక ప్రజలు, భక్తులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. తంబళ్లపల్లె, పరసుతోపు, జుంజుర పెంట, ఆర్ ఎన్ తాండ, కొటాల, గుండ్ల పల్లి తో పాటు పలు పంచాయతీలలో వందలాదిగా వినాయక విగ్రహాలు పెద్దేరు ప్రాజెక్టు, చిన్నేరు ప్రాజెక్ట్, దబ్బలగుట్టపల్లి ప్రాజెక్ట్, పలు చెరువుల్లో వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. తంబళ్లపల్లి గణేష్ యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఎన్నడూ లేని విధంగా భారీ క్రేన్ సాయంతో పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల వద్ద డిజె సిస్టం, వాయిద్య బృందాలు, భారీ బాణసంచా పేలుళ్లు, కోలాటాలు, చెక్క భజనలు, నృత్యాలు,పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పెద్ద ఎత్తున భక్తులు, యువత రంగులు చల్లుకుంటూ సంతోషంగా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మండలంలో నిమజ్జన కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Admin
Namitha News