నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - అక్టోబర్ 10 : నేటి ఆధునిక యుగంలో ప్రకృతి వ్యవసాయం తో పండించిన పంటల ఫల సాయంతో ఆరోగ్యంతో పాటు పర్యావరణం పరిరక్షణ జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ సి ఎం ఎఫ్ ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ వెంకట్ మోహన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో జీవవైవిద్య పంటల సాగు పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ రబీ సీజన్లో ఆర్ డి ఎస్ పద్ధతిలో పలు రకాల పంటలు జీవ వైవిధ్య పద్ధతిని అనుసరించి పెట్టుకోవాలని తద్వారా మొక్కకు కావలసిన పోషకాలు అంది వ్యవసాయ భూమి గొల్ల భారి భూమిలో కర్బ నన్ శాతం పెరుగుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకంతో పంటలు పండించి సత్ఫలితాలు రాబట్టాలన్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంతో వరి, సామలు, కొర్రలు, సజ్జ, జొన్న, మినుములు, పెసలు,కాయగూరలు, ఆకుకూర, దుంపల పంటలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎర్రసానిపల్లి వద్ద జీవ వైవిధ్య పంటల సాగు లో ఏర్పాటుచేసిన ఫుడ్ బాస్కెట్ పరిశీలించి వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తి పెంపుకు కిచెన్ గార్డెన్స్ కిడ్స్, ఆర్ డి ఎస్ కిడ్స్ కోసం వివో ల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామని ఏపిఎం గంగాధర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఏలు పవన్, రమణ నాయక్, చిరంజీవి, ఎన్ ఎఫ్ ఎఫ్ రుక్మిణి, ఎంటి రఘునాథ్, తంబళ్లపల్లి యూనిట్ ఇంచార్జ్ రాజు, సిబ్బంది నిజాముద్దీన్, రెడ్డప్ప, సుగుణమ్మ, సిద్ధమల్లు, అర్షియా భాను, సుజాత, సుకన్య, పద్మజ, సునీత రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News