Thursday, 16 April 2026 06:40:24 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జిల్లా సహాయ బాలికా అభివృద్ధి అధికారిణి

Date : 10 April 2025 10:24 AM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబలకోట, ఏప్రిల్ 9: జిల్లా సహాయ బాలికా అభివృద్ధి అధికారి శ్రీమతి బి.శిరీష బుధవారం అన్నమయ్య జిల్లా, కురబలకోటలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె 9వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, ‘ముందుచూపు’ కార్యక్రమం సంబంధించి నోటు పుస్తకాలు పరిశీలించారు . విద్యార్థులు ఈ కార్యక్రమంలో చూపిన చొరవను ఆమె అభినందించారు.ఆమె స్కూల్ స్టోర్ రూమ్‌ను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి, నిల్వల నిర్వహణ సక్రమంగా ఉన్నదని నిర్ధారించారు. అంతేగాక, వంటగది శుభ్రత, పాఠశాల ఆవరణ పరిశుభ్రతను పరిశీలించి, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం అవసరమని పేర్కొన్నారు. తర్వాత, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, పాఠశాల సమగ్రాభివృద్ధికి దోహదపడే విలువైన సూచనలు ఇచ్చారు. విద్యార్థుల ప్రవేశాలను పెంచాల్సిన అవసరం ఉందని, అలాగే వారి ప్రాథమిక జ్ఞానాన్ని మెరుగుపరచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం బాలికల విద్యాభివృద్ధి పట్ల ఉపాధ్యాయుల అంకితభావం కొనసాగించాలని కోరారు. పై కార్యక్రమంలో ప్రిన్సిపల్ రఫియా పర్వీన్, బోధనా సిబ్బంది నిర్మలమ్మ ,ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, శ్రావణి, షబానా, పుష్పలత, సుమలత, రత్నప్రియ, రమణమ్మ , భానుప్రియ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :