నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 04 : రామసముద్రం మండలం లోని ఊలపాడు పంచాయతీ రాగిమాకుల పల్లి క్రాస్ వద్ద ఉన్న హాజ్రత్ పీర్ మున్వీర్ అలీషా ఖాదరి దర్గా నందు మంగళవారం సాయంత్రం దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున దర్గా వద్ద పౌర్ణమి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. 1984,85 లో హజరత్ పీర్ మున్వీర్ అలీషా ఖాదరి ఈ దర్గాను నిర్మించి, 2006 వరకు ఈ దర్గా ఉరుసు ఉత్సవాలు నిర్వహించారని తరువాత ఆయన మరణానంతరం 2006 నుండి దర్గా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీపారాధన లో పాల్గొన్న భక్తులకు దర్గా కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
Admin
Namitha News