నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జులై 09 : వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రజలు ముళ్ళ కంచెలను లెక్కచేయనకుండా జగనన్న చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రజలు కానీ కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్టు పెట్టుకొని ఎన్ని అడ్డంకులను సృష్టించినది జగనన్నపై ఉన్న అభిమానాన్ని తగ్గించలేరన్న దానికి ఊదాహరణ. బంగారుపాలెం ఘటన. వైఎస్ఆర్సిపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్. వారి ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.వైయస్ జగన్ గారి బంగారుపాళ్యంకు వస్తున్నారని తెలుసుకొని వెళ్తున్న మామిడి రైతులను, రోడ్డు వెంబడి వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను సైతం పోనివ్వకుండా అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వం.పలమనేరు నియోజకవర్గ వర్గంలోని అన్ని మండలాల ప్రధాన రహదారులు పై నిలబడ్తున్న పోలీసులు...చిత్తూరు జిల్లాలో హైఅలెర్ట్.. అడుగు అడుగునా పోలీస్ చెక్ పోస్టులు పెట్టి రైతులను ప్రజలను పెద్ద ఎత్తున అడ్డుకుంటున్న పోలీసులు మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కొనసాగుతున్న ఆంక్షలు.. పోలీసులు నిర్బంధంలో బంగారుపాళ్యం మార్కెట్ యార్డు బంగారుపాళ్యం వైపు వస్తున్న వాహనాలు బయట ప్రాంతంలోనే నిలిపి వేస్తున్న పోలీసులు రైతులను, వైసీపీ నాయకులను లాంటి చాట్ చేసి తరిమికొట్టి ఎంతోమందిని నిర్బంధించారూ. జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తుంది కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోకపోగా మరియు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించడానికి వస్తుంటే ఇంత దౌర్భాగ్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అమానుషం కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టి అడ్డుకోవడమేంది. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనది. 13 నెలలైనా కూటమి ప్రభుత్వం వచ్చి ఏ ఒక్కరికి న్యాయం చేసిన పాపాన పోలేదు. ఆనాడు రైతులను వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్ని విధాల ఆదుకున్నారు ఉచిత విద్యుత్. రుణమాఫీ. ఎరువులు విత్తనాలు. మామిడి మొక్కలను ఇచ్చి వివేకాకుండా ఎన్నో పండ్ల మొక్కలు అన్ని ఇచ్చి రైతుకు పెద్దపీట వేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు బాధపడిన దాఖలాలు లేవు రైతు పండించిన పడ్డకు గిట్టుబాటు ధర కల్పించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వే కాకుండా ఎరువులు విత్తనాలు రైతు భరోసా ఇచ్చి అన్నిరకాలుగా రైతులను ఆదుకున్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకోకపోగా. వారి ఆదుకోవడానికి వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం ఎంతవరకు సమాజశం ఈ పాలన అన్ని విధాలుగా ఫెయిల్ అయింది.ఇదే ఉదాహరణ జనాలు జగన్ మీద నమ్మకంతో మళ్లీ జగనన్నకు జై కొడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చింతాకంతా మేలు చేయలేదు. ఇకనైనా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన ఆంక్షలు విధించడం మానేసి ప్రతిపక్ష నాయకుడు అయిన టువంటి జగన్మోహన్ రెడ్డికి పూర్తి రక్షణ కల్పిస్తూ ప్రజల్లో తిరగనివ్వాలి లేదంటే ప్రతి వైయస్సార్సీపి కార్యకర్త ఒక సైనికుడై జగనన్నకు అండగా నిలబడి రాష్ట్ర మొత్తం తిరగడానికి సిద్ధమవుతారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం కనులు తెరిచి పోలీసులు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం...
Admin
Namitha News