నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 11 : టి. బి. ముక్త్ భారత్ అభియాన్ ప్రత్యేక క్యాంపెయిన్ ను విజయవంతం చేద్దామని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మరియు టి. బి. పర్యవేక్షకులు ప్రభాకర్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి వారి ఆదేశాల మేరకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ,టి. బి. పర్యవేక్షకులు ప్రభాకర్ లు మదనపల్లి రూరల్ పరిధిలోని అమ్మచెర్వు మిట్ట లో ఉన్న వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి మరియు భాగ్యలక్ష్మి కన్వీనర్ ల ఆధ్వర్యంలో టి. బి వ్యాధి పై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ (డి. హెచ్. ఈ.ఓ) మాట్లాడుచు టి. బి.ముక్త్ భారత్ అభియాన్ 100రోజుల కార్యక్రమం లో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పొగత్రాగు వారిని, మద్యం సేవించు వారిని, గతం లో టి. బి. జబ్బు వచ్చి భాగైన వారిని, హెచ్. ఐ. వి. పాజిటివ్ వారిని, బి. ఎమ్. ఐ 18 కంటే తక్కువ ఉన్న వారిని, గర్భవతులను, షుగర్ ఉన్న వారిని, దీర్ఘాకాలిక జబ్బులు ఉన్న వారిని గుర్తించి వారికి గళ్ళ పరీక్షలు నిర్వహించి, వారికి పాజిటివ్ వచ్చిన యెడల ఆరు నెలల చికిత్స ఉచితంగా ప్రారంభించడం జరుగుతుంది అన్నారు. చికిత్స సమయం లో రోగి ఖాతా లో రు 1000/-జమ చేయడం జరుగుతుంది అన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం కోసం ఈ పైకం వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నారు.టి. బి. రోగులకు పౌష్టికాహారం అందించుటకు అనగా వారిని దత్తత తీసుకోవడానికి పోషన్ మిత్రలు ముందుకు రావాలాన్నారు ఇందులో భాగంగా వెలుగు స్వచంద సేవా సంస్థ తరపున 10మంది టి. బి. రోగులకు పౌష్టికాహారం ఇవ్వడానికి దత్తత తీసుకోవడం జరిగింది.. మరియు విభిన్న ప్రతిభావంతుల పాఠశాల విద్యార్థుల కు అవగాహన కల్పించి వారిచే టి. బి. ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం ప్లాకార్డ్స్ ప్రదర్శన చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం లో వెలుగు సోసియల్ వర్కర్ గీత, విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ప్రిన్సిపాల్ లీనా కుమారి, టి. బి. యూనిట్ సిబ్బంది సుశీల, వనజ,ఆశ్రమ ఏ. ఎన్. ఎమ్.గీత, కోళ్ల బైలు ఏ. ఎన్. ఎమ్ జ్యోతి, ఎమ్. ఎల్. హెచ్. పి శ్రావణి,, ఆశాకార్యకర్తలు నిస్సి గేసి, రెడ్డి కుమారి పాల్గొన్నారు.
Admin
Namitha News