నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 26: భారతదేశ రాజ్యాంగ హక్కులను కాపాడటం మనందరి కర్తవ్యమని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో రాజ్యాంగం ఏర్పాటు దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. దేశంలోని విభిన్న వర్గాల అభివృద్ధి, సంక్షేమం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనర్వచనీయమని ఎంపీడీవో కొనియాడారు. ఈ సందర్భంగా ఈఓఆర్టి దిలీప్ కుమార్ నాయక్ సభ్యుల చేత భారత దేశ రాజ్యాంగాన్ని కాపాడుతామని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News