నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 22 : రామసముద్రం మండలంలోని కాప్పల్లె, ఆర్. నడింపల్లె గ్రామ పంచాయతీల సచివాలయలలో శనివారం సర్పంచ్ లు నారాయణమ్మ తిప్పరాజు, నడింపల్లె ఉపసర్పంచ్ రాజేశ్వరి అధ్యక్షతన మండల డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ ఏ గఫూర్ ఆధ్వర్యంలో స్వామిత్వ గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ నారాయణమ్మ తిప్పరాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని నేను పంచాయతీకి సహాయ సహకారాలు అందిస్తాని ఆయన తెలిపారు , పంచాయతీ ఎదరయ్యే సమస్యలకు తక్షణమే స్పందిస్తానని, ప్రజావసరాల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాననీ హామీ ఇచ్చారు. గ్రామస్థులు కూడ తమ సమస్యలు అభిప్రాయాలను అధికారులు, ప్రజా ప్రతినిధులసమక్షంలో వెళ్ళడించారు. టిడిపి నాయకులు కోవా కృష్ణమూర్తి,లోక రాజు, నడింపల్లె రమేష్, గంగప్ప రెడ్డెప్ప మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో పంచాయతీ లను అభివృద్ధి చేస్తామన్నారు . డిప్యూటీ ఎంపిడిఓ గఫుర్ మాట్లాడుతూ పంచాయతీల్లోని పరిధిలోని ఇంటి యజమానులకు వారి ఇంటి ఖాళీ స్థలము మరియు ఇంటి నిర్మాణంతో కొలతలు 9(2) తీసి నోటీసులు పంపిణీ చేసి వాటిలో గల కొలతలు సరిచూసుకొని ఏవైనా అభ్యంతరములు ఉంటే గ్రామసభలో రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. గ్రామ ప్రజలకు అభ్యంతరములను స్వీకరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గపూర్ పంచాయతీ సెక్రటరీలు సాకేమ్మ, సుబ్బారెడ్డి, సర్పంచ్ నారాయణమ్మ, తిప్పరాజు, ఉపసర్పంచ్ రాజేశ్వరి, కోవాకృష్ణమూర్తి, లోకరాజు, నడింపల్లె రమేష్, వెంకటేష్, ఆర్. వేణు గోపాల్ రెడ్డి రహమతుల్లా, శ్రీనివాసులు, రెడ్డెప్ప,ఎం ఆర్ పి యస్ భాస్కర్ రెడ్డెప్ప వెంకటరమణ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News