నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె -సెప్టెంబర్ 11 : తంబళ్లపల్లె మండలం లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకుల సహకారంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ నాయకులకు సూచించారు. శుక్రవారం బి.కొత్తకోటలో మాజీ ఎమ్మెల్యే తంబళ్లపల్లె టిడిపి నాయకులతో సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృశ్యా నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి మన కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారానికి అధికారుల సహకారంతో నెరవేర్చాలన్నారు. కొత్త పెన్షన్ల ఎంపికలు కూటమి నాయకులు చొరవ చూపి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. సమస్యల పరిష్కారంలో తన వంతు పూర్తి సహకారం ఉంటుందని నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ప్రజల మనసులను గెలిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అవినీతి వైకాపాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పురుషోత్తం, పి.అల్లావుద్దీన్, ఉమాపతి, మాజీ జడ్పిటిసి రామచంద్ర, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల్ రెడ్డి, నరసింహులు, కాలా నారాయణ, సురేంద్ర, వీరాంజనేయులు,రామచంద్రారెడ్డి, రషీద్ భాషా, ఐసుల కృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News