నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - మే 22 : చౌడేపల్లి మండలం బోయకొండ షికారిపాల్యం లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం మేరకు 22 సంవత్సరాల శివాని అనే యువతి కర్ణాటకలోని షికారిపురలో నివసిస్తోంది. అక్కడే నివసించే రాఘవ్ను ప్రేమించినట్లు తెలిసింది. అయితే వారి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన శివాని శుక్రవారం విషం తాగి ఆపస్మారక స్థితి లో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
Reporter
Namitha News