నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డీఆర్డీఓలో శిక్షణకు విశ్వం ఇంజినీరింగ్ విద్యార్థుల ఎంపిక ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, బెంగళూరులో స్టూడెంట్ ట్రైనింగ్కు ముగ్గురు విద్యార్థులు ఎంపికై నందున విశ్వం ఇంజనీరింగ్ కళాశాలకు గర్వకారణం. మదనపల్లె సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కళాశాల (ఆటోనమస్) లోని రిసెర్చ్ & డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన డీఆర్డీఓ – ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), బెంగళూరు లో స్టూడెంట్ ట్రైనింగ్ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ టిఎస్ గౌస్ బాషా, విభాగాధిపతులు డాక్టర్ బి సురేష్ బాబు మరియు డాక్టర్ వసంత సెలవ కుమార్ మరియు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన విద్యార్థులు బాలు CSE, వెంపల్లి సబీహా CSE, సోమగుట్ట హిమబిందు ECE. భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన డీఆర్డీఓలో శిక్షణకు ఎంపిక కావడం వారి అకాడమిక్ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం, పరిశోధనా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని కళాశాల రిసెర్చ్ & డెవలప్మెంట్ సెల్ డాక్టర్ అంజన్ కుమార్ పేర్కొన్నారు. ఈ విజయం కళాశాల విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని మరింత పెంచుతుందని, భవిష్యత్తులో ఉన్నత అవకాశాలకు దోహదపడుతుందని కళాశాల అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు
Reporter
Namitha News