Wednesday, 17 June 2026 03:35:02 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ దత్త యూనివర్సిటీ ల మధ్య స్కిల్ డెవలప్మెంట్ లో అవగాహన ఒప్పందం

Date : 15 June 2026 07:09 PM Views : 19

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 15 : మదనపల్లి పట్టణం సమీపం లోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగం వారు మరియు బెంగళూరు కు చెందిన దత్తా ఇన్‌స్టిట్యూట్ ల మధ్య విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ మరియు ఉపాధి అవకాశాల లక్ష్యంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దత్తా ఇన్‌స్టిట్యూట్ హెడ్ -ఆపరేషన్స్ అభిలాష్ బెల్లం, లీడ్ లెర్నింగ్ పార్టనర్ నాగ చరణ్ కొణిదెల, లక్ష్మీధర్ మరియు డీన్- స్కూల్ అఫ్ మేనేజిమెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. విద్యా సంస్థలు మరియు పరిశ్రమల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ, విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ విపణి అవసరాలకు సిద్ధం చేయడంలో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలవనుంది అని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రత్యేక శిక్షణ, వర్క్‌షాపులు, సర్టిఫికేషన్ కోర్సులు, పరిశ్రమ నిపుణుల ఉపన్యాసాలు మరియు అభ్యాస అవకాశాలు కల్పించనున్నారు. అలాగే ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగార్హత పెంపు కార్యక్రమాలు, కెరీర్ మార్గదర్శకత్వం, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం మరియు ప్లేస్‌మెంట్ సహాయాన్ని అందించడం ద్వారా విద్యార్థుల వృత్తిపరమైన సామర్థ్యాలను మరింత మెరుగుపరచనున్నారు. విద్యా సంస్థలు మరియు పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ, విద్యార్థులను భవిష్యత్‌కు సిద్ధమైన నైపుణ్యవంతులుగా, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులుగా తీర్చిదిద్దడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, డీన్- స్కూల్ అఫ్ మేనేజిమెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :