నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 15 : మదనపల్లి పట్టణం సమీపం లోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు మరియు బెంగళూరు కు చెందిన దత్తా ఇన్స్టిట్యూట్ ల మధ్య విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ మరియు ఉపాధి అవకాశాల లక్ష్యంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దత్తా ఇన్స్టిట్యూట్ హెడ్ -ఆపరేషన్స్ అభిలాష్ బెల్లం, లీడ్ లెర్నింగ్ పార్టనర్ నాగ చరణ్ కొణిదెల, లక్ష్మీధర్ మరియు డీన్- స్కూల్ అఫ్ మేనేజిమెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. విద్యా సంస్థలు మరియు పరిశ్రమల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ, విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ విపణి అవసరాలకు సిద్ధం చేయడంలో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలవనుంది అని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రత్యేక శిక్షణ, వర్క్షాపులు, సర్టిఫికేషన్ కోర్సులు, పరిశ్రమ నిపుణుల ఉపన్యాసాలు మరియు అభ్యాస అవకాశాలు కల్పించనున్నారు. అలాగే ఇంటర్న్షిప్లు, ఉద్యోగార్హత పెంపు కార్యక్రమాలు, కెరీర్ మార్గదర్శకత్వం, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం మరియు ప్లేస్మెంట్ సహాయాన్ని అందించడం ద్వారా విద్యార్థుల వృత్తిపరమైన సామర్థ్యాలను మరింత మెరుగుపరచనున్నారు. విద్యా సంస్థలు మరియు పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ, విద్యార్థులను భవిష్యత్కు సిద్ధమైన నైపుణ్యవంతులుగా, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులుగా తీర్చిదిద్దడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, డీన్- స్కూల్ అఫ్ మేనేజిమెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు
Reporter
Namitha News