నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురవంక పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా తిరుపాల్ నాయక్ మదనపల్లె మండలం, కురువంక గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా తిరుపాల్ నాయక్ నియమితులయ్యారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో తిరుపాల్ నాయక్ ను మండల ఇన్ ఛార్జ్ వినోద్ కుమార్, జనసేన యువ నాయకులు పసుపులేటి చంద్రశేఖర్, బీసీ నాయకులు బెల్లేరెడ్డి ప్రసాద్, బెల్లె హారతి, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంతో అనుభవమున్న తిరుపాల్ నాయక్ మా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా రావడం ఎంతో సంతోషం గా ఉందన్నారు. ఆయన పాలనలో గ్రామ పంచాయితీ మరింత అభివృద్ధి సాధించాలని అకాంక్షించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వేసవిలో ఎండలు మండుతున్న కారణంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. వీధిలైట్లు సక్రమంగా పనిచేసే చూడాలని, రోడ్లు, కాలువలు శుభ్రంగా ఉంచాలని కోరారు. పంచాయతీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు.
Reporter
Namitha News