నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని బిటి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు. స్థానిక చారిత్రాత్మక బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన వ్యవహారాల శాఖ (స్టెప్) ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12 న నిర్వహించనున్న జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. లైఫ్ మెసేజ్ అఫ్ స్వామి వివేకానంద ఆన్ క్యారెక్టర్ బిల్డింగ్, వికసిత్ భారత్-2047, రోల్ ఆఫ్ యూత్ ఇన్ ది సొసైటీ బిల్డింగ్, డ్రగ్ అడిక్షన్ - ఇట్స్ అఫెక్ట్స్ అనే అంశాలపై వ్యాసరచన, వక్తృత్వం, చర్చాకార్యక్రమం మొదలైన విభాగాలలో ఈ పోటీలు నిర్వహించారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఎదగాలన్నారు. కో-ఆపరేటివ్ శాఖకు చెందిన దుర్గ వివేకానందుని జీవిత ఘట్టాలను వివరించి విద్యార్థులను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమం లో జిల్లా స్టెప్ అధికారులు వి.వి.నారాయణ, ఫల్గుణ, కళాశాల అధ్యాపకులు డాక్టర్ శైలజ సి.ఎస్, డాక్టర్ శ్రీనివాస్ డేరంగ్, డాక్టర్ జి.చిన్నారెడ్డి, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు
Reporter
Namitha News