నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 16 : దశాబ్దాలుగా అణగారిన మాదిగ జాతి బిడ్డలు భవిష్యత్తులో చదువుతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డానియల్ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన తంబళ్లపల్లె మండలంలో మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు పలు గ్రామాల్లో పర్యటించి మాదిగ బిడ్డలను బడిలో చేర్పించి వారి చదువు కోసం తల్లిదండ్రుల్లో చైతన్యం నింపాడు. ఈ సందర్భంగా గోపి దీన్నే దళిత వాడకు చెందిన నాగేంద్ర, తిమ్మమ్మ ల కుమార్తె నందిని టెన్త్లో 515/600 మార్కులు సాధించడంపై ఆ బాలికను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నందిని ని వెలుగు ఏపిఎం గంగాధర్, సీసీలు, ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేట మల్లికార్జున, గోపి దీన్నే నరసింహులు, శ్రీనివాసులు , మల్లికార్జున రెడ్డప్ప ,హిళా సంఘాలు అభినందించి ఆశీర్వదించారు
Reporter
Namitha News