నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం దేశానికే ఆదర్శవంతం - ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి కితాబు - 14వ వార్డులో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ మదనపల్లె : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం దేశానికే ఆదర్శమని ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) కితాబునిచ్చారు.బుధవారం 14వ వార్డులోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ అవ్వ,తాతలు,దివ్యాంగులు,ఒంటరి మహిళలు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల జీవితాలకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లను రూ.4,6,15 వేలకు పెంచారన్నారు.ఇక కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు.ప్రజా సంక్షేమం,రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రంలోకి పెట్టుబడులు పెద్దసంఖ్యలో వస్తున్నాయని,పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని కొనియాడారు.మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని,అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేస్తూ,సీఎం సహాయనిధి చెక్కులు అధిక మొత్తంలో మంజూరు చేయించారని ప్రశంసించారు.కూటమి పాలనలో ఏపీ,మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధిలో సరికొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షించారు.
Reporter
Namitha News