నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 13 : తంబళ్లపల్లె కు సమీపంలోని వారపు సంతలో వెలసిన కోటకొండ గంగమ్మ జాతర గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలోని 32 గ్రామాల ప్రజలు గంగమ్మ తల్లికి డీలు బోనాలు ఊరేగింపుగా వెళ్లి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. రాత్రికి చాందిని బండ్ల మెరవణులు, బాణసంచా పేలుళ్లు, కోలాటాలు, చెక్క భజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, సామి రెడ్డి, కృష్ణమూర్తి నాయుడు, బాలకృష్ణారెడ్డి, తదితరులు పేర్కొన్నారు
Reporter
Namitha News