నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి- ఆగస్టు 15 : తంబళ్లపల్లె మండలంలో మహిళా సంఘాలలో వెలుగు నింపి సంఘాలపటిష్టత, రుణ సౌకర్యాలు, వారు స్వయం సమృద్ధి సాధన తో పాటు వారు అన్నిరంగాలలో ముందుకు రావడానికి విశేష కృషి చేసిన ఏపీఎం గంగాధర్ కు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం పై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు ఆర్థిక అభివృద్ధి కృషి చేసిన ఏపిఎం గంగాధర్ ను ఎంపీడీవో ఉషారాణి, డిప్యూటీ ఎంపీడీవోలు ఎంవి ప్రసాద్, మారుతీకుమార్, ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, మండల సమాఖ్య అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, సీసీలు, వివో లీడర్లు, మహిళా సంఘాలు ప్రశంసల జల్లు కురిపించారు
Reporter
Namitha News