నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 20 : గత వైకాపా ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి పచ్చి మోసం చేస్తే నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీల పక్షపాతిగా మారడం హర్షణీయమని రాష్ట్ర టిడిపి బీసీ ఉపాధ్యక్షుడు తులసీధర్ నాయుడు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బీసీలను ఆదరిస్తే నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలను చట్టసభల్లో అందలానికి ఎక్కించి చరిత్రలో నిలిచిపోయాడని ఇందులో 34 శాతం రిజర్వేషన్లు టిడిపిలో ఓ కలికితురాయిగా నిలిచిపోతుందని బీసీలు టిడిపికి శాశ్వతంగా అంకితం అవ్వాలని సూచించారు
Reporter
Namitha News