Tuesday, 15 September 2026 11:45:12 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

తప్పులు లేని ఓటరు జాబితా ను రూపొందించాలి

జూన్ 15 నుంచి జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే : కలెక్టర్ నిశాంత్ కుమా

Date : 29 May 2026 07:07 PM Views : 108

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు కృషి చేయాలి జూన్ 15 నుంచి జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ : అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, ఇందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత అవసరమన్నారు. జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు ఏఈఓలు, బీఎల్ఓలు, డీఈఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంటింటి సర్వే విధానం, ఎన్యుమరేషన్ ఫారముల నిర్వహణ, కొత్త ఓటర్ల నమోదు, సాంకేతిక అంశాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి కుటుంబాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు. ఈ సర్వేలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారములు పంపిణీ చేసి అంగీకార పత్రాలు సేకరిస్తారని తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తయిన యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు ఫోటో, చిరునామా, కుటుంబ వివరాల మార్పులను కూడా నవీకరించనున్నట్లు పేర్కొన్నారు. మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి గుర్తింపు, ఒకే వ్యక్తికి బహుళ ఓటరు కార్డులు ఉన్నట్లయితే వాటి తొలగింపు వంటి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. అర్హత లేని పేర్లు జాబితాలో లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఓటరు జాబితా సిద్ధమైన అనంతరం జూలై 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్, సవరణలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ఓటరు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హుడైన వ్యక్తి తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ హరి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :