Sunday, 13 September 2026 03:50:44 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

తన భూమిని కాజేయాలని దాయాదుల కుట్ర - తన భర్త,కుమారుడిని కోల్పోయానని బాధితురాలి ఆవేదన - అధికారులు చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదని వెల్లడి - మద్దతు తెలిపి

Date : 23 November 2025 11:43 AM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తన భూమిని కాజేయాలని దాయాదుల కుట్ర - తన భర్త,కుమారుడిని కోల్పోయానని బాధితురాలి ఆవేదన - అధికారులు చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదని వెల్లడి - మద్దతు తెలిపిన జనసేన నాయకులు రాయల్ గణి,చక్రి మదనపల్లె : తన భూమిని కాజేయాలని దాయాదులు కుట్రలు పన్నుతున్నారని ములకలచెరువు మండలం,దేవుళచెరువుకు చెందిన రెడ్డెం లక్ష్మిదేవి ఆరోపించారు.శనివారం ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడును విన్నవించుకుంది.ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ తన భర్త రెడ్డెం రామిరెడ్డికి పూర్వీకుల నుండి సంక్రమించిన సర్వే నెంబర్ - 225లోని 1.21 ఎకరాలు భూమిపై దాయాదుల కన్నుపడిందని,ఇదే క్రమంలో తన భర్త రామిరెడ్డి,కుమారుడు మోహన్ రెడ్డిలను కోల్పోవడం జరిగిందని రోధించింది.అయితే తన భూమిని కాపాడుకోవడం కోసం అధికారులు,పోలీసులు చుట్టూ తిరిగిన న్యాయం జరగలేదని ఆరోపించారు.బాధితురాలికి ఉమ్మడి చిత్తూరు జిల్లాల జనసేన పార్టీ నాయకులు రాయల్ గణి నిలిచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో భూకబ్జాలు మితిమీరి పోయాయన్నారు.ఖాళీ స్థలం కనపదినా,ఖాళీ భూమి కనబడిన కబ్జా చేయడమే కబ్జాదారుల పని అన్నారు.రెడ్డెం లక్ష్మీదేవి తన సొంత భూమికి సంబంధించిన పత్రాలు కోసం కాళ్లరిగేలా తిరిగిన న్యాయం జరగకపోవడం దురదృష్టకరమన్నారు.అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎన్ఎంవై 202511191025 ద్వారా అర్జీ సమర్పించింది.ఆమె సమస్యపై ములకలచెరువు సిఐని విచారణ జరపాలని ఆదేశించినప్పటికీ,ఎటువంటి స్పందన లేదన్నారు.సంవత్సరం క్రితం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైల్స్ దగ్ధమయ్యాయని,అందులో ఎంతోమంది పేదవారికి చెందిన భూముల పత్రాలు కాలిపోయాయన్నారు.దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజనుగా మదనపల్లి పేరు ప్రఖ్యాతి గడించిందని,అదే తరహాలో ఈ ప్రాంతంలో కబ్జాలు సైతం పెరిగిపోయాయన్నారు.పేదల భూములను,ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.ఒకరిద్దరిని అలా శిక్షిస్తే కబ్జాలకు చేసే వారికి భయం పుట్టుకొస్తుందన్నారు.ఇప్పటికైనా ఎవరూ లేని రెడ్డెం లక్ష్మీదేవి పరిస్థితిని అర్థం చేసుకుని కలెక్టర్,సబ్ కలెక్టర్,రెవెన్యూ అధికారులు,పోలీసు అధికారులు ఆమె భూమికి సంబంధించిన రికార్డులు అందజేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.బాధితురాలికి న్యాయం జరిగే వరకు జనసేన తరఫున పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చక్రి పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :