నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : మదనపల్లి పట్టణం లో శుక్రవారం బిజెపి నేత చల్లపల్లి నరసింహా రెడ్డి ఇంటి వద్ద బీహార్ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో బాణ సంచా పేల్చి, స్వీట్స్ పంచి, మోడీ జిందాబాద్, భారత్ మాతా కో జై అని నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకొన్న బిజెపి నాయకులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భీహార్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు, ప్రతిపక్షాలు చెప్పిన అబ్బద్దపు మాటలను ప్రజలు నమ్మలేదు సరికదా ఓటు చోరీ అంటూ ఊదర గొట్టుతూ ప్రచారం చేసిన మాటలను సముద్రం లో కలిపేశారు. అభివృద్ధి ని చూసి బిజెపి కి పట్టం కట్టారని వ్యాఖ్యనించారు. ఈ కార్యక్రమం లో బిజెపి నేత చల్లపల్లి నరసింహా రెడ్డి, శేతు నల్లుస్వామి, డాక్టర్ అజంతుల్లా ఖాన్, బర్నేపల్లి రవి తదితర స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News