నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 04 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ మహా శివుని సన్నిధిలోని గోమాతలు పశుగ్రాసం కరువై ఆకలి తో అలమటిస్తున్నాయి. గోమాతల ఆకలిబాధ ఓ రైతుకే తెలుస్తుంది. మండలంలోని గుండ్లపల్లి పంచాయతీ చెట్లవారిపల్లి కు చెందిన రైతు రామిగాని సురేందర్ రెడ్డి, సతీమణి సుభాషిణి, కుమారుడు ప్రతాపరెడ్డిలు స్వామివారి సన్నిధిలోని గోమాతలు ఆకలితో అలమటిస్తున్న దృశ్యాన్ని చూసి మనసు చెలించి పోయిన ఆ కుటుంబం వెంటనే స్వయంగా ట్రాక్టర్ లోడ్ వేరుశనగ చెక్క మల్లయ్య కొండ గోశాలకు తరలించి దేవాదాయశాఖ రికార్డు అసిస్టెంట్ కొండకిట్ట కు అప్పగించారు. సురేందర్ రెడ్డి కుటుంబం చేసిన దాతృత్వాన్ని దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, స్థానిక భక్తులు, ప్రజలు హర్షం వ్యక్తం చేసి ప్రశంసలతో ముంచెత్తారు.
Reporter
Namitha News