నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 07 : రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు పచ్చ జెండా ఊపడంతో సోమవారం తంబళ్లపల్లె మండలంలో పెన్షన్ల కోసం లబ్ధిదారులు సచివాలయాలకు పోటెత్తారు. మండలంలోని 11 సచివాలయాలలో 21 పంచాయతీలకు చెందిన లబ్ధిదారులు ఉదయం నుండే తమ దరఖాస్తు ఫారాలతో కార్యాలయాలకు హాజరు కావడంతో సర్వర్లు మొరాయించాయి.దీంతో లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది. మండలంలోని కొటాల, గోపిదిన్నె, కోటకొండ, కుక్కరాజు పల్లె, కోసువారిపల్లె, బాలిరెడ్డి గారిపల్లి,కన్నెమడుగు,ఎద్దుల వారిపల్లె, తంబళ్లపల్లె, పరసతోపు, రేణుమాకులపల్లె సచివాలయాలలో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఆదేశాల మేరకు టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇన్చార్జిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు దగ్గరుండి దరఖాస్తులు సిద్ధం చేయించారు
Reporter
Namitha News