Sunday, 13 September 2026 10:20:32 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఎంపి మిధున్ రెడ్డి చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది

Date : 13 November 2025 05:01 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ఎంపి మిధున్ రెడ్డి చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది... అభివృద్ధికి చిరునామా రాజంపేట పార్లమెంటు -- మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ స్పష్టం -- ఎంపి మిధున్ రెడ్డి ని విమర్శించే స్దాయి మీది కాదు... ఆర్‌జె వెంకటేష్ కు కౌంటర్ ఇచ్చిన నిస్సార్ అహమ్మద్... ఎన్నో విమర్శలు చేయవచ్చు... ఒకటిన్నర సంవత్సరంలో మీరు చేసింది శూన్యం... రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిధున్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, చేసిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. ‌గురువారం మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్, పరిశీలకులు అనూష రెడ్డి హజరైనారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిధున్ రెడ్డి పై విమర్శలు చేసేవారు నియోజకవర్గ అభివృద్ధి కూడా చూడాలని హితవు పలికారు. టిడిపి నాయకులు ఆర్‌జె వెంకటేష్ మిధున్ రెడ్డి పైన విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, వైసిపి ప్రభుత్వం హయ్యాంలో అటవీ భూముల విషయంలో మీకు సమస్య వస్తే ఎంపి ఇంటి దగ్గర కాసుకుని వుండి పనులు చేయించుకోలేదా అని ప్రశ్నించారు. ఎంపి మిధున్ రెడ్డి ని విమర్శించే స్దాయి మీది కాదని అన్నారు. మదనపల్లె నియోజకవర్గంలో మిధున్ రెడ్డి మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం, ఎంపి నిధులతో చేనేత భవన్, నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, కరోన కష్టకాలంలో ఆక్సిజన్ సిలెండర్లు, ఇలా ఎన్నో మిధున్ రెడ్డి చోరవతో వచ్చాయని వివరించారు. ‌విమర్శలు చేసే ముందు చేసిన అభివృద్ధి కూడా చూడాలని సూచించారు. ‌ఎడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. ఒక్క రోడ్డు అయినా వేశరా అని ప్రశ్నించారు. ‌మెడికల్ కాలేజీలు పిపిపి విధానంలో చేపడితే అన్ని విధాల నష్టం చేకూరుతుందని అన్నారు.‌ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :