నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 05 : 2026 లో విబి జీరామ్జీ పథకంలో ఉపాధి హామీ పనులు ఊపందుకోవాలని కూటమి నాయకులు టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, బిజెపి అధ్యక్షుడు రమణ, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు లు ఆకాంక్షించారు. సోమవారం మండలంలోని 21 పంచాయతీలలో ఏపీవో అంజనప్ప సారధ్యంలో గ్రామసభలు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభలలో ఉపాధి హామీ 125 రోజులు పెంపు, ఉపాధి పనుల ముందస్తు ప్రణాళిక, ప్రతి కూలికి పని కల్పించడం, 20 47 వికసిత్ భారత్ లక్ష్యసాధన పై కూలీలకు అవగాహన కల్పించారు. ఈ గ్రామ సభలకు కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ అధికారులు, ఈసీ మహేష్, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్,టి ఏ లు సుజాత, పుష్పకుమారి , భూదేవి, బాలగంగాధర్, క్షేత్ర సహాయకులు,మండలంలోని సర్పంచులు, వార్డు సభ్యులు, అధికార కూటమి నాయకులు, మహిళా సంఘాలు, రైతులు, కూలీలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News