నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 17 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లె లో వెలసిన టిటిడి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో పనిచేస్తున్న పోటు వర్కర్ మధుసూదన్ వ్యవహార శైలిపై జిల్లా ఇన్చార్జి మంత్రి బిసీ జనార్దన్ రెడ్డితో టీటీడీ ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినట్లు మండల టిడిపి అధ్యక్షుడు వి రెడ్డప్పరెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015లో పోటు వర్కర్ గా చేరిన మధుసూదన్ ఆలయంలో భక్తుల పట్ల నోటి దురుసు, అమర్యాదగా మాట్లాడడం తోపాటు స్వామివారి నైవేద్యంలో శుద్ధి చేయని బియ్యం, ఉద్దిపప్పు వాడటం తో పాటు వండే సమయంలో మత్తు పదార్థం (హాన్స్) నోటిలో ఉంచుకొని స్వామి ప్రసాదం వండి అపవిత్రం చేస్తున్నాడని ఏమని అడిగితే కొందరు నాయకుల అండతో పైరవీలు చేస్తున్నట్లు విమర్శించాడు. దీంతోపాటు ఆలయంలోని బియ్యం, జీడిపప్పు, నెయ్యి, నూనె, అభిషేకానికి వాడే పూలు, పాలు, పెరుగు, నెయ్యి ఆలయంలోని కొందరి సహకారంతో రహస్యంగా అక్రమంగా తరలించినట్లు ఆరోపించారు. పోటు వర్కర్ చేస్తున్న అక్రమాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కొనసాగిస్తున్నట్లు తెలుసుకొని ఫిర్యాదులు చేశామని వీటిపై స్పందించి టిటిడి ఉన్నతాధికారులు విచారణకు హాజరవుతున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు
Reporter
Namitha News