నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుడిపల్లి - జూలై 21 : సోమవారం, 20వ తేదీన రాత్రి 12 గంటల సమయంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఎటువంటి అనుమతి పేపర్లు లేకుండా గ్రానైట్ రాళ్లను తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి ఆపి తనిఖీ చేశారు. వాహనంలో గ్రానైట్ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించడంతో, సంబంధిత వాహనాన్ని సీజ్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. సీజ్ చేసిన వాహనాన్ని మైనింగ్ మరియు రవాణా శాఖ వారికీ అప్పగించడమైనది అని గుడిపల్లి యస్.ఐ. శ్రీకాంత్ తెలిపారు. అక్రమంగా గ్రానైట్, ఇసుక, ఇతర ఖనిజాలను రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు
Reporter
Namitha News