Thursday, 30 July 2026 09:07:09 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

జిల్లాలో ఇద్దరు సైబర్ నేరస్తులు, మోస్ట్ వాంటెడ్ గజదొంగ అరెస్ట్..

Date : 23 June 2026 08:35 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు రెండు కీలక కేసులను ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులతో పాటు వరుస చోరీలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ గజదొంగను అదుపులోకి తీసుకున్నారు.జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన దర్యాప్తులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్జిత్ చటియా, త్రిపురకు చెందిన అహలోటియన్ కైపింగ్‌ను సైబర్ క్రైమ్ కేసులో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2 లక్షల నగదు,57 చెక్కులు, వివిధ బ్యాంకులకు చెందిన పాస్‌బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.ఇదిలా ఉండగా, జిల్లాలోని రాయచోటి, చిన్నమండెం, గుర్రంకొండ, కలకడ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో జరిగిన వరుస చోరీల కేసులను ఛేదించిన సీసీఎస్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ నిందితుడు షేక్ ఖాజాపీర్‌ను అరెస్టు చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన అతడు జిల్లాలో సుమారు 50 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీఎస్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి 42 గ్రాముల బంగారు ఆభరణాలు,250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: