నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కౌశల్ ప్రతిభా పరీక్షల నిర్వహణకై జిల్లా,రాష్ట్ర కో-ఆర్డినేటర్ల నియామకం - అన్నమయ్య నుండి నలుగురు ఉపాధ్యాయుల ఎంపిక మదనపల్లె : భారతీయ విజ్ఞాన మండలి (బీవీఎం) మరియు ఏపీ - కాస్ట్ సంయుక్తంగా ప్రతి సంవత్సరం నిర్వహించే కౌశల్ ప్రతిభా పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్నమయ్య జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో వివిధ బాధ్యతలకు ఉపాధ్యాయులను భారతీయ విజ్ఞాన మండలి రాష్ట్ర శాఖ నియమించింది.అన్నమయ్య జిల్లా కో-ఆర్డినేటర్గా గట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బి.కొత్తకోట మండలం) పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కట్టా భాస్కర్ నియమితులయ్యారు.జిల్లా జాయింట్ కో-ఆర్డినేటర్లుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కురబలకోటలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పి.రెడ్డి రాధ,జిల్లా పరిషత్ పాఠశాల మదనపల్లిలో గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జి.రవి కుమార్ నియమితులయ్యారు.అదేవిధంగా రాష్ట్ర అకడమిక్ కో-ఆర్డినేటర్గా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,రాయచోటిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మధుమతిలు ఎంపికయ్యారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం,సృజనాత్మక ఆలోచనా శక్తి,ప్రతిభను వెలికితీయడం మరియు వారిలో పోటీతత్వ స్ఫూర్తిని పెంపొందించడంలో కౌశల్ ప్రతిభా పరీక్షలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు నియమితులైన కో-ఆర్డినేటర్లు కృషి చేయనున్నారు.జిల్లా,రాష్ట్ర కో-ఆర్డినేటర్లుగా ఎంపికైన ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమకు ఈ అవకాశం కల్పించిన భారతీయ విజ్ఞాన మండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని,సృజనాత్మక ఆలోచనలను వెలికి తీయడానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.
Reporter
Namitha News