Thursday, 16 April 2026 08:28:10 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మిట్స్ డీమ్మ్డ్ యూనివర్సిటీ కి 3సంవత్సరాల పాటు నేషనల్ బోర్డు అఫ్ అక్రిడేషన్

Date : 30 July 2025 08:41 PM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 30 : మదనపల్లె సమీపం లోని మిట్స్ (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) డీమ్డ్ యూనివర్సిటీ లో గల బి.టెక్, ఏం.బి.ఏ మరియు ఏం.సి.ఏ కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (యెన్.బి.ఏ) ద్వార 3 సంవత్సరాల పాటు అక్రిడిటేషన్ లభించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఈ అక్రిడిటేషన్ పొందడం అనేది విద్యా నైపుణ్యం, నాణ్యమైన విద్య మరియు ఫలితాల ఆధారిత అభ్యాసానికి మా స్థిరమైన నిబద్ధతకు గుర్తింపు అని ఆయన అన్నారు. ఈ మైలురాయి పరిశ్రమ-సంబంధిత కార్యక్రమాలను అందించడంలో మరియు విద్యార్థుల ఉపాధిని పెంపొందించడంలో ఉపయోగ పడతాయని అన్నారు. బి.టెక్ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోని ఏం.సి.ఏ, ఏం.బి.ఏ ప్రోగ్రాం లకు ఈ అక్క్రిడిటేషన్ లభించినట్లు, 2028 జూన్ 30 వరకు ఈ అక్క్రిడిటేషన్ ఉందని ఆయన అన్నారు. ఆధునిక పాఠ్యాంశాలు & మౌలిక సదుపాయాలు, నిరంతర నాణ్యత మెరుగుదలలో భాగంగా విద్యార్థులు నవీకరించబడిన సిలబస్‌లు, అర్హత కలిగిన అధ్యాపకులు మరియు అధునాతన టెక్నాలజీ తో ప్రయోగశాలల నుండి ప్రయోజనం పొందుతారు అని ఆయన అన్నారు. ఈ అక్రిడిటేషన్ లభించడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :