నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 30 : మదనపల్లె సమీపం లోని మిట్స్ (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) డీమ్డ్ యూనివర్సిటీ లో గల బి.టెక్, ఏం.బి.ఏ మరియు ఏం.సి.ఏ కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (యెన్.బి.ఏ) ద్వార 3 సంవత్సరాల పాటు అక్రిడిటేషన్ లభించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఈ అక్రిడిటేషన్ పొందడం అనేది విద్యా నైపుణ్యం, నాణ్యమైన విద్య మరియు ఫలితాల ఆధారిత అభ్యాసానికి మా స్థిరమైన నిబద్ధతకు గుర్తింపు అని ఆయన అన్నారు. ఈ మైలురాయి పరిశ్రమ-సంబంధిత కార్యక్రమాలను అందించడంలో మరియు విద్యార్థుల ఉపాధిని పెంపొందించడంలో ఉపయోగ పడతాయని అన్నారు. బి.టెక్ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోని ఏం.సి.ఏ, ఏం.బి.ఏ ప్రోగ్రాం లకు ఈ అక్క్రిడిటేషన్ లభించినట్లు, 2028 జూన్ 30 వరకు ఈ అక్క్రిడిటేషన్ ఉందని ఆయన అన్నారు. ఆధునిక పాఠ్యాంశాలు & మౌలిక సదుపాయాలు, నిరంతర నాణ్యత మెరుగుదలలో భాగంగా విద్యార్థులు నవీకరించబడిన సిలబస్లు, అర్హత కలిగిన అధ్యాపకులు మరియు అధునాతన టెక్నాలజీ తో ప్రయోగశాలల నుండి ప్రయోజనం పొందుతారు అని ఆయన అన్నారు. ఈ అక్రిడిటేషన్ లభించడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసారు.
Admin
Namitha News