నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : పుంగనూరు మండల పరిషత్తు సాధారణ నిధులు రూ.1.37 కోట్లు స్వాహా చేసిన ఉదంతంలో పలువురు అధికారులు, సిబ్బందిని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జడ్పీ సీఈవో గ్లోరియా గురువారం సాయంత్రం సస్పెండ్ చేశారు. కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేట ర్ పొరుగుసేవల కింద గత ఆరేళ్లుగా పనిచేస్తున్న సునీల్.. నాలుగేళ్లుగా దశల వారీగా పరిషత్తు సాధారణ నిధుల నుంచి నగదు స్వాహా చేశాడు. చివరికి రూ. 1,36,68,668 నిధుల స్వాహా అయ్యాయని విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇన్ని ఆక్రమాలు కళ్లెదుటే జరు గుతున్నా గుర్తించడంలో విఫలమైన పుంగనూరు అప్పటి ఎంపీడీవో, ప్రస్తుత ఏవో రాజేశ్వరి, ఎగువశ్రేణి సహాయ కుడు రాజశేఖర్రెడ్డిని సైతం సస్పెండ్ చేశారు. మరోవై పున ఈవోపీఆర్డీ.. డీపీవో పరిధిలో ఉండటంతో తాత్కా లికగా తొలగిస్తూ డీపీవో లక్ష్మి సైతం ఉత్తర్వులు ఇచ్చారు. నాలుగేళ్లుగా మండల పరిషత్తు జనరల్ ఫండ్ నిధులు దుర్వినియోగమవుతున్నా గుర్తించడంలో అక్కడి అధికారులు వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. ఒక పనికి సంబంధించి రెండుసార్లు బిల్లులు పెట్టి, అధికారి వేలిము ద్రలు సరిగా పడలేదని సాకులు చెప్పి.. ఇలా డబ్బు భారీగా కాజేసినట్లు గుర్తించారు.
Admin
Namitha News