నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైనది.... మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ వెల్లడి... అమ్మచెరువుమిట్ట శేషాచల నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైనదని, ఈ పర్వదినంతోనే పండగలు మొదలవుతాయని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానం మేరకు తొలి ఏకాదశి పండుగ రోజున మదనపల్లె టౌన్ అమ్మచెరువుమిట్ట శేషాచల నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణోత్సవం, హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమానికి నిస్సార్ అహమ్మద్ హాజరైనారు. ఆలయం వద్ద వైసిపి నాయకులు, స్దానిక ప్రజలు నిస్సార్ అహమ్మద్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందించి, తొలి ఏకాదశి విశిష్టత, ఈ రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదనే విషయాన్ని సవివరంగా తెలియజేశారు. అనంతరం ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ తొలి ఏకాదశి పవిత్రత, విశిష్టత తెలియజేశారు. హిందువులు ఎంతో పవిత్రతో తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటారని, తొలి ఏకాదశి పండుగ నుండి వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయని, హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముందనే విషయాన్ని తెలిపారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని, వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారని, తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఎంతో పుణ్య ఫలం అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, S.V. రమణ, ఎస్.రమేష్ బాబు, మునిశేఖర్, ఫక్రుద్దీన్, మధు, బయారెడ్డి, నర్సింహులు, చెన్న, మల్లికార్జున, యూనస్, యాసిన్, అబ్దుల్లా, సాదిక్, జభి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News