నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు -మార్చి 23 : మొలకలచెర్వు మార్కెట్ యార్డ్ నందు ఏ.పీ.మార్క్ ఫెడ్ మరియు నా ఫెడ్ ఆధ్వర్యంలో రైతుల నుండి కందులను ప్రభుత్వం కొనుగోలు కార్యక్రమం లో పాల్గొన్న టిడిపి ఇంచార్జి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి. ఈ సందర్భంగా జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు నాణ్యత ను బట్టి మంచి రేటు ఇస్తుందని , రైతులకు మేలుచేసే ప్రభుత్వం మీకు అంతా మంచే జరుగుతుందని తెలుపుతూ కంది కొనుగోలు మద్దతు ధర రూ.7500 క్వింటాకు ప్రభుత్వం ఇస్తుందని , భవిష్యత్తు లో వివిధ రకాల పంటలను కూడా మంచి ధర తో ఇక్కడే అమ్ముకొనే వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి తోపాటు అన్నమయ్య జిల్లా మార్కెటింగ్ ఏడి త్యాగరాజు , మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కె.వి.రమణ , మాజీ సర్పంచ్ ఎర్రగుడి సురేష్ , కట్ట హరి , కులబలకోట మండల కన్వీనర్ వై జి సురేంద్ర, విశ్వనాథ్ రెడ్డి , చౌడ్ శెట్టి రమణమూర్తి , బజంత్రీ రామానుజులు , జాన్ సీన మరియు రైతు సోదరులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News