నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - జూన్ 12 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గుర్రంకొండ మండలంలో అంబరాన్ని అంటిన సంబరాలు . రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గుర్రంకొండ లో మండల అధ్యక్షుడు నాయని జగదీష్ ఆధ్వర్యంలో మరియు కూటమి శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీల్లో ఇప్పటికే పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ , దీపం పథకం 2 అమలు చేశారని, మరో కీలకమైన తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టారని, ఒకటవ తరగతి నుండి ఇంటర్ ఫస్టియర్ లో చేరే విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం అడ్మిషన్లు పూర్తి డేటా అందుబాటు లోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు దాదాపు 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తిస్తుందని ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లోకి 15వేల రూపాయలు జమ కానుందని 8745 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో గుర్రంకొండ మండల అధ్యక్షుడు నాయిని జగదీష్ , మాజీ సర్పంచ్ నౌషాద్ అహ్మద్ , రంజిత్ , ఎజాజ్ అహ్మద్, ఎల్లుట్ల మురళి, కూటమి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Admin
Namitha News