నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మైఫోర్స్ నూతన అధ్యక్షుడిగా ఉమేష్. రానున్న రోజుల్లో మైఫోర్స్ చేపట్టనున్న కార్యక్రమాలు అయినటువంటి తల్లితండ్రులు లేని ఆడపిల్లలను చదివించడం కోసం "మైఫోర్స్ విద్యా అభయం" పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో "పవనన్న ప్లాంటేషన్ డ్రైవ్" డ్రగ్స్ కి అడిక్టై ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్న యువతను క్రీడలవైపు మళ్ళించడానికి క్రీడలకు అడిక్ట్ చేయడం లక్ష్యంగా నిర్వహించబోతున్న "పవనన్న క్రికెట్ కప్" కార్యక్రమాల నిర్వహణ కోసం నూతన కమిటీలు నియమించిన మైఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మైఫోర్స్ మహేష్. గత పది సంవత్సరాలుగా మదనపల్లి తో పాటు పడమటి నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న "మైఫోర్స్" రానున్న రోజుల్లో తల్లి తండ్రి లేని ఆడపిల్లల విద్యకి అండగా ఉండడం కోసం "మైఫోర్స్ విద్యా అభయం" పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం "పవనన్న ప్లాంటేషన్ డ్రైవ్" పెడదారిన పడుతున్న యువత డ్రగ్స్ కి అడిక్ట్ అయి జీవితాలు నాశనం చేసుకుంటున్న తరుణంలో యువతని క్రీడల పట్ల చేయాలని ఉద్దేశంతో "పవనన్న క్రికెట్ కప్" మరియు ఫుట్బాల్ టోర్నమెంట్లను నిర్వహించబోతున్న ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం మైఫోర్స్ నూతన కమిటీలను మైఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మై ఫోర్స్ మహేష్ ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు ఐఫోర్స్ నూతన కమిటీలు అధ్యక్షుడిగా ఉమేష్ ఉపాధ్యక్షులుగా ఫాజిల్ ఖాన్, చుక్క నితిన్ రాజ్, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీగా విద్యాసాగర్, సందీప్ రెడ్డి జనరల్ సెక్రటరీలుగా మధుసూదన్ రాయల్, మేకల వెంకటరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొట్టాల సురేష్, దండు రేవంత్ కుమార్ వర్కింగ్ సెక్రటరీగా మనోజ్ కుమార్, అప్సర్ భాష మై ఫోర్స్ అనుబంధ సంఘాలు మై ఫోర్ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షుడిగా భోగ్గల మహేంద్ర ఐటీ వింగ్ అధ్యక్షుడిగా తోట రతీష్ ఎంప్లాయిస్ అధ్యక్షుడిగా వెన్నం సురేష్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా బసినికొండ శోభ యూత్ వింగ్ అధ్యక్షుడిగా గౌర నికేష్ సోషల్ మీడియా ఇన్చార్జిగా బి జయంత్ ప్రోగ్రామ్స్ కమిటీ అధ్యక్షుడిగా కలవలపల్లి నాగేంద్ర మై ఫోర్స్ తంబాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా సద్దికూటి దామోదర్ పీలేరు నియోజకవర్గ ఇన్చార్జిగా బూజుపేట గంగాధర్ మదనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా నవీన్ కుమార్ కురబలకోట మండల అధ్యక్షుడిగా ఉప్పుతోల కృష్ణమూర్తి తంబాలపల్లి మండల అధ్యక్షుడిగా దొడ్డింటి రఘునాథ్ మైఫోర్ చారిటబుల్ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా డాక్టర్ రిచర్డ్ స్టీఫెన్ వెస్లీ, జలజాక్షి, శెట్టిపల్లి హరిబాబు, కే కృష్ణకుమార్, కరణం సునీత లను మొదటి విడత మైఫోర్స్ కమిటీల్లో మై ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మైఫోర్స్ మహేష్ నియమించి వారికి నియామక పత్రాలు అందించడం జరిగింది, వీరందరూ కలిసి మైఫోర్స్ ఆధ్వర్యంలో జరగబోయే అన్ని సామాజిక కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడంతోపాటు మైఫోర్స్ సిద్ధాంతం అయినటువంటి కుల మత ప్రాంత భేదాలు లేని సమాజం లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ సూచించారు.
Reporter
Namitha News