నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి: ఈనెల జూన్ 13.14 తేదీలలో జమ్మూ (జ&కా) జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణానికి చెందిన షేక్ షబ్బీర్ కుమారుడు ప్రముఖ యువ క్రీడాకారుడు షేక్ అలీ అహ్మద్ తను ఎంపికైనట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం అలీ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ యూత్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోచర్ నంద వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో పాల్గొంటున్నానని చెప్పారు. జాతీయస్థాయి లో జరిగేఈ కబడ్డీ పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక జట్లు పాల్గొంటున్నాయని ఈ యువ క్రీడాకారుడు తెలిపారు. ఈ కబడ్డీ పోటీలలో విజయం సాధించి అన్నమయ్య జిల్లా రాయచోటి పేరు నిలబెడతామన్నాడు.
Admin
Namitha News