నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి :నమిత న్యూస్: మార్చి 28:-థియేటర్లలో ఎన్నికల ప్రచార ప్రకటనలకు రాజకీయ పార్టీల నేతలు మరియు థియేటర్ మేనేజ్మెంట్ వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.భారతదేశ ఎన్నికల కమిషన్, సార్వత్రిక ఎన్నికలు - 2024 పై ఈనెల 16న ఇచ్చిన ఎన్నికల ప్రకటన అనుసరించి 16వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఎం సి సి అమలులో ఉన్నంతవరకు రాజకీయ పార్టీల నేతలు ,థియేటర్ మేనేజ్మెంట్ వారు ఎం సి సి కి లోబడి ప్రవర్తించాలన్నారు. ఇందులో భాగంగా, రాజకీయ పార్టీలు, పార్టీల నేతలు థియేటర్ మేనేజ్మెంట్ వారు, థియేటర్లలో ప్రదర్శించబోయే ఎన్నికల ప్రచార ప్రకటనలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఆర్డీవోలు , తహసిల్దార్లు వారి పరిధిలోని థియేటర్లను ఆకస్మిక తనిఖీలు చేసి నియమాలను ఏ థియేటర్ వారైనా ఉల్లంఘించినట్లయితే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
Admin
Namitha News