Thursday, 16 April 2026 07:00:22 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

వ్యవసాయ రంగం అభివృద్ధికి అధికారులు సహకరించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 27 September 2025 02:33 PM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 26 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో భారీ వర్షాలతో పాటు హంద్రీనీవా జలాలు రావడం హర్షనీయమని రైతుల వ్యవసాయ రంగానికి అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. శుక్రవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఉన్నత స్థాయి అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి లు నియోజకవర్గంలో గత ఖరీఫ్ పంట సాగు, వేసిన పంటల వివరాలు, దిగుబడి,రబీ సీజన్లో రైతులు ఆశిస్తున్న పంటల వివరాలపై వ్యవసాయ, హార్టికల్చర్, సిరికల్చర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేరుశనగ, మొక్కజొన్న, వరి, టమోటా, మామిడి, పంటల పరిస్థితిపై ఆరా తీసి రైతులకు యూరియా, ప్రభుత్వ రాయితీ అందించిన వివరాలను అడిగి సానుకూల సమాధానం రాబట్టారు. అదేవిధంగా సిరికల్చర్, పండ్ల తోటలు, పెంపకం, పాడి పరిశ్రమ, పశువులకు సకాలంలో టీకాలు, వైద్యం అందించాలన్నారు.వర్షాకాలం అంటూ వ్యాధులు సోకుండా వైద్య సిబ్బంది రోగులకు సకాలంలో ఆసుపత్రులలో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఉపాధ్యాయుల కొరత లేకపోవడంతో విద్యా విధానంపై దృష్టి సారించి సత్ఫలితాలు సాధించడానికి ఎంఈఓ లు దృష్టి సారించాలన్నారు. అంగన్వాడి సెంటర్లలో మాత శిశు సంరక్షణకు పౌష్టికాహారం తోపాటు వైద్యం పై అప్రమత్తంగా ఉండాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల అధికారులు రోడ్లు మరమ్మతులు, అభివృద్ధి పనులు కు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ రాయితీ తో నిర్మిస్తున్న ఎస్సీ ఎస్టీ పక్కా గృహాలు పూర్తి చేసి నూతన పక్కా గృహాల దరఖాస్తులపై దృష్టి పెట్టాలన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలు మరమ్మతులు, రైతులకు పంట నష్టం పై ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సోలార్ పవర్ పై అవగాహనతో పాటు లో వోల్టేజ్ సమస్య లేకుండా రైతులకు సకాలంలో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుత జీఎస్టీ రాయితీపై ప్రజల్లో అవగాహనకు సూపర్ జీఎస్టీ పేరుతో నెల రోజులు పాటు పండుగ చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ప్రతి శనివారం సాయంత్రానికి తాము నిర్దేశించిన సమస్యల పరిష్కారం తోపాటు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని హెచ్చరించారు. ఉపాధి హామీలో పండ్ల తోటలు, పశుగ్రాసం, మొక్కల పెంపకం విరివిగా చేపట్టాలన్నారు. మహిళా సంఘాలకు విరివిగా రుణాలు మంజూరు తో పాటు వారిని వ్యాపార రంగం వైపు మళ్ళించి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి సహకరించాలన్నారు.రెవిన్యూ రీసర్వే భూముల సమస్యల పరిష్కారం, పంటల బీమా, వర్షాలతో పంట నష్టాలు, సాగునీటి వనరుల పై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా మండల టిడిపి నాయకులు కలెక్టర్ నిశాంత్ కుమార్ ను దుశ్యాలువ తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఆరు మండలాల తాసిల్దారులు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు, ఏఈలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :