Thursday, 16 April 2026 06:50:16 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అజ్ఞాతంలోకి బంగారు నగల వ్యాపారి

నగల తయారీ పేరుతో లక్షల్లో వసూలు -- లబోదిబో మంటున్న బాధితులు

Date : 27 October 2025 05:27 PM Views : 87

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అజ్ఞాతంలోకి బంగారు నగల వ్యాపారి -- నగల తయారీ పేరుతో లక్షల్లో వసూలు -- లబోదిబో మంటున్న బాధితులు -- పోలీస్ స్టేషన్ కు పరుగులు గత కొన్నేళ్లుగా నమ్మకంగా నగల వ్యాపారం నిర్వహిస్తూ ఆభరణాలు తయారు చేస్తూ కస్టమర్లకు నమ్మకాన్ని కలిగించిన ఓ నగల వ్యాపారి పెద్ద మొత్తంలో నగదు, నగలు వసూలు చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గత పది రోజులుగా షాపు మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సోమవారం పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టారు. ఈ మేరకు స్థానిక ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె పట్టణం, స్థానిక సిపాయి వీధికి చెందిన కె సురేష్ కుమార్ అనే వ్యక్తి శ్రీ సాయి సురేష్ జ్యువెలర్స్ పేరుతో స్థానికంగా జ్యువెలరీ షాప్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో బంగారు ఆభరణాలు విక్రయించటం తో పాటు ఆర్డర్ ప్రకారం ఆభరణాలు తయారు చేయించి ఇచ్చేవాడు. ఇతనితోపాటు అన్న నాని, తండ్రి నారాయణ ఆచారి పనిచేసేవారు‌ కాగా ఇతనికి మదనపల్లె మండలం బొమ్మనచెరువు కు చెందిన మహేష్ రూ. 3,40,000 చెల్లించి ఆభరణాలు ఆర్డర్ ఇచ్చాడు. అదేవిధంగా రెడ్డి ప్రసాద్ అనే అతను 150 గ్రాముల పాత బంగారు, రూ. 15,00,000 నగదు ఇచ్చి ఆభరణాలు చేయించమని ఆర్డర్ ఇచ్చాడు. పట్టణానికి చెందిన రవిచంద్ర రూ. 3,00,000, రవితేజ రూ.8 లక్షలు ఇచ్చారు. ఇలా పలువురి వద్ద నగలు ఆర్డర్ తీసుకున్న సురేష్ కుమార్ లక్షల్లో వసూలు చేసి కుటుంబ సభ్యులతో సహా గత పది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. షాపు తెరవకపోవడం, ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోని బాధితులు మోసపోయామేమోనని‌ భావించి సోమవారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టారు. జరిగిన మోసం, అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు. అయితే సురేష్ కుమార్ వీరి వద్దనే కాకుండా పలువురి వద్ద నగలు, నగదు తీసుకుని ఉడాయించాడని, సుమారు రూ. 20 కోట్లకు పైగానే కోర్టులో ఐపి దాఖలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తారు వేచి చూడాల్సి ఉంది.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :