Thursday, 16 April 2026 04:56:27 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి జీవం పోయండి - ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు టిడిపి నాయకుల మొర.

Date : 23 October 2025 08:59 PM Views : 429

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - అక్టోబర్ 23 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో నకిలీ మద్యం కేసుతో తెలుగుదేశం పార్టీకి మకిలి సోకిందని మీరు జోక్యం చేసుకొని తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి జీవం పోయాలని టిడిపి నాయకులు ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు మొరపెట్టుకున్నారు. గురువారం మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, సీనియర్ నాయకుడు వెంకట్ రెడ్డి లో ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను కలసి పార్టీ స్థితిగతులపై వివరించారు. పార్టీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి గౌరవం లేదని నాడు వైకాపా అరాచక పాలనలో కేసులు, అరెస్టులు, దాడులు భరించినా నేటికీ ఆ గాయాలు మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్టీకి పూర్తిస్థాయిలో కష్టపడి కష్టనష్టాలకు నిలబడి సేవ చేసిన నాయకులకు గౌరవం లేకపోగా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో కానరాని అవకాశవాద నాయకుల తో పార్టీ సిద్ధాంతాలు అటకెక్కి పక్కదారి పట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్న నిజమైన నాయకులకు, కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గం పార్టీకి కంచుకోటని పార్టీఅధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తంబళ్లపల్లె నియోజకవర్గం లో ప్రక్షాళన జరుగుతుందని అక్కడి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే నాయకుడిని నియమించి తెలుగుదేశం పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :