నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 8 : ః తంబళ్లపల్లె మండలం జుంజురపెంట మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు మాతృమూర్తి శాంతమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. మంగళవారం తంబళ్లపల్లె టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరిపల్లి జయ చంద్రారెడ్డి జుంజుర పెంట చేరుకుని శాంతమ్మ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణమూర్తి నాయుడు తోబాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఓదార్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి తులసీదర్ నాయుడు, బేరి శ్రీనివాసులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, సామి రెడ్డి, నరసింహులు,సుధాకర్ రెడ్డి, సోమశేఖర్,పురుషోత్తం, నాగేంద్ర నాయుడు, కాలా నారాయణ, సాంబశివారెడ్డి, సిద్ధమల్ రెడ్డి, రామలింగారెడ్డి, శంకర్ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
Namitha News