Thursday, 16 April 2026 04:50:03 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

అక్టోబరు 15 నుండి ఇసుక డిమాండ్ కు అనుగుణంగా లభ్యత.

రాష్ట్ర అబ్కారీ, భూగర్భ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా.

Date : 06 October 2024 10:07 PM Views : 278

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రానున్న వేసవి కాలంలో నెలకొనే ఇసుక డిమాండ్ కు అనుగుణంగా లభ్యత పెంపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వాణిజ్యపన్నుల శాఖ ఛీఫ్ కమీషనర్, అబ్కారీ, భూగర్భ, గనుల శాఖ ముఖ్య కార్యాదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ 2024 జులై 8 నుండి అమలులోకి తీసుకురాగా, స్టాక్‌యార్డ్‌ల వద్ద 4.8 లక్షలు, డి-సిల్టేషన్ పాయింట్లు వద్ద 54 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం సిద్దంగా ఉందన్నారు.రోజువారీ సరఫరా సామర్థ్యం 37,000 మెట్రిక్ టన్నులు కాగా, అక్టోబర్ 2024 నుండి మార్చి 2025 వరకు 1.5- 1.75 కోట్ల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని అంచనా వేసామని మీనా తెలిపారు. డిమాండ్‌ను తీర్చడానికి సిద్దం చేసిన కార్యాచరణ ప్రణాళికను అనుసరించి డి-సిల్టేషన్ పాయింట్లు (28) నుండి 54 లక్షలు, మాన్యువల్ రీచ్‌లు (108) నుండి 70 లక్షలు, సెమీ-మెకనైజ్డ్ రీచ్‌లు (48) నుండి 140 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సేకరిస్తామన్నారు. ప్రస్తుతం, డి-సిల్టేషన్ పాయింట్లు, మాన్యుల్ రీచ్‌లకు అన్ని అనుమతులు ఉన్నాయని, ఆగస్టు 15 నుండి డి-సిల్టేషన్ పాయింట్ల నుండి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయన్నారు. వర్షాకాలంలో నది ఒడ్డున ఇసుక మైనింగ్ కార్యకలాపాలపై పరిమితి కారణంగా అక్టోబర్ 16 నుండి మాన్యువల్ రీచ్‌ల నుండి కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. ఈ రెండు మార్గాల ద్వారా దాదాపు 1.25 కోట్ల మెట్రిక్ టన్నులు సమకూరుతుందన్నారు. సెమీ-మెకనైజ్డ్ రీచ్‌లను ఆపరేట్ చేయడానికి అనుమతుల ప్రక్రియ ప్రాసెస్‌లో ఉండగా డిసెంబర్ నాటికి మరో 140 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా ప్రారంభమవుతుందన్నారు. పట్టా భూముల నుండి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, వీరంతా ఇసుక మేనేజ్‌మెంట్ పోర్టల్‌లో ఇసుక డీ-కాస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా అభ్యర్థించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీలు భవిష్యత్తులో ఇసుక సరఫరాను సులభతరం చేయడానికి ఇసుక చేరిన ప్రాంతాలను మరింతగా గుర్తిస్తాయన్నారు. ధరల హెచ్చుతగ్గులు, రవాణాదారుల దోపిడీ లేకుండా ఉండేలా రాష్ట్రం అంతటా ఒకే విధంగా రేట్లు నియంత్రించబడగా, వినియోగదారులకు ఇసుకను రవాణా చేయడానికి వారి స్వంత వాహనాలను ఎంచుకోవచ్చు లేదా నిర్ణీత రేటుతో ప్రభుత్వం అందించిన రవాణాను ఎంచుకోవచ్చని మీనా వివరించారు. "AP సాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్", ఆన్‌లైన్ పోర్టల్‌లో https://sand.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. ప్రతి వారం, ఇసుక సరఫరా సామర్థ్యం మేరకు రాబోయే వారానికి ఒకేసారి విడుదల చేస్తుండగా, భవిష్యత్తులో మిగిలి పోయిన వారంవారీ సరఫరాలో కొంత భాగాన్ని "తత్కాల్" తరహాలో అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లో అత్యవసర ఇసుక అవసరాలను తీర్చడానికి వారపు సామర్థ్యంలో 10 శాతం నిల్వను కలిగి ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పరంగా ఎటువంటి రుసుము వసూలు చేయటం లేదని, కేవలం సీనరేజి, నిర్వహణ, జిఎస్టి, రవాణా ఖర్చులు మాత్రమే ఉంటాయని ముఖేష్ కుమర్ మీనా తెలిపారు. అక్రమ కార్యకలాపాల నిరోధం, వనరుల రక్షణతో సహా ఇసుక తవ్వకం, రవాణా, మైనింగ్ వంటి వాటిపై ప్రభుత్వ విధానాలను ఖచ్చితంగా పాటించేలా ప్రతి జిల్లాలో బహుళ-విభాగ అధికారులతో (గనులు, రెవెన్యూ, పోలీస్, పర్యావరణం) జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ పనిచేస్తుందన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :